అక్షరటుడే, బాన్సువాడ: Banswada | విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ అన్నారు.
మండలంలోని కోనాపూర్ (Konapur goverment school) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట (Badibaata) కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాధ, శేఖర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.