More
    HomeజాతీయంPahalgam terror attack | ఉగ్రవాదంపై కఠిన చర్యలు..అఖిల పక్ష భేటీలో నిర్ణయం

    Pahalgam terror attack | ఉగ్రవాదంపై కఠిన చర్యలు..అఖిల పక్ష భేటీలో నిర్ణయం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgam terror attack) పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

    “జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, పర్యాటకం వృద్ధి చెందుతున్న తరుణంలో స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే లక్ష్యంతోనే పహల్గావ్​ ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ ఘటన, అనంతరం తీసుకున్న చర్యలను అఖిలపక్ష నేతలకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ వివరించారు. ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అవి పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే తాము ఉంటామని అన్ని పార్టీల నేతలు చెప్పారు” అని కిరణ్ రిజిజు వివరించారు.

    పార్లమెంట్ సముదాయంలోని భవనంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష నేతల కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు.

    పహల్గావ్​ ఉగ్రదాడిని అందరూ ముక్తకంఠంతో ఖండించినట్లు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ తెలిపారు. కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కశ్మీర్ లో శాంతియుత పరిస్థితుల కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

    Latest articles

    MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...

    BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

    అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...

    ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....

    EPFO | ఈపీఎఫ్​ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్...

    More like this

    MLA arrest | దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అరెస్టు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MLA arrest : పహల్గవ్​ మారణహోమంపై ఓవైపు దేశమంతా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఆలిండియా...

    BRS silver jubilee celebration | బీఆర్​ఎస్​ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు : బాజిరెడ్డి జగన్​

    అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal​ జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన...

    ED raids| జెన్సాల్ ఇంజినీరింగ్ లో ఈడీ దాడులు.. ప్రమోటర్ పునీత్​సింగ్​ జగ్గీని అదుపులోకి తీసుకున్న ఈడీ

    అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది....
    Verified by MonsterInsights