అక్షరటుడే, బాన్సువాడ: Thunderstorm | ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ స్తంభాలు(Electricity poles) నేలకూలాయి. గాలుల దాటికి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాలివేగానికి దాబాపై నుంచి పడి చనిపోగా.. మరొకరు చెట్టుకొమ్మ విరిగి మీద పడడంతో మృతి చెందారు.
Thunderstorm | మేడపై నుంచి పడి..
భారీ ఈదురుగాలులకు మేడపై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన బాన్సువాడ(Banswada)లో చోటు చేసుకుంది. తాడ్కోల్ శివారులోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్లో ప్రభు అనే వ్యక్తి డాబాపై పడుకున్నాడు. ఈదురుగాలులు వీయడంతో ఆయన లేచి నిలబడ్డాడు. ఈ క్రమంలో గాలిదాటికి దాబా పైనుంచి ఎగిరి కిందపడ్డాడు. భవనంపై నుంచి భారీ శబ్దం రావడంతో కాలనీ వాసులు వచ్చి చూసేసరికి ప్రభు మృతి చెందాడు.
Thunderstorm | చెట్టు కొమ్మ పడి..
నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో పులాంగ్ అంగిటి దాబా వెనుక కల్లు కాంపౌండ్లో చెట్టు విరిగి పడడంతో ఒకరు మృతి చెందారు. వినాయక్ నగర్(Vinayaka Nagar) ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(35) అక్కడ కూర్చుని కల్లు తాగుతున్నాడు. ఆ సమయంలో ఈదురుగాలుల దాటికి చెట్టు కొమ్మ విరిగి ఆయనపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. శ్రీనివాస్ విద్యుత్ శాఖ(Electricity Department)లో పని చేస్తున్నాడు.