అక్షరటుడే, ఇందూరు: World Environment Day | ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ పురస్కారాలను (Green Champion Award) ప్రకటించింది. ఇందులో పాఠశాలల విభాగంలో జిల్లాలోని ముప్కాల్ (Mupkal) మండలం రెంజర్ల జడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానం దక్కింది.
గత విద్యా సంవత్సరంలో చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలకు గాను రెంజర్ల పాఠశాలను ఎంపిక చేశారు. దీంతో గురువారం హైదరాబాద్లోని (Hyderabad) రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (State Pollution Control Board) కార్యాలయంలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సుద్ధపల్లి మల్లేష్కు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ను డీఈవో అశోక్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, పాఠశాల హెచ్ఎం రవికుమార్ అభినందించారు.