అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాలకు సంబంధించి క్రికెట్ పోటీలను (Police Cricket tourney) ఆదివారం ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం నిత్యం ఒత్తిడితో కూడుకుని ఉంటుందన్నారు. దీంతో క్రీడల్లో పాల్గొంటే ఒత్తిడికి దూరం కావొచ్చని స్పష్టం చేశారు. సమయం దొరికినప్పుడు తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం, అలైడ్ బ్రాంచ్లు, హోమ్ గార్డ్స్ విభాగాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగాయి. అదనపు డీసీపీ(అడ్మిన్)బస్వారెడ్డి, అదనపు డీసీపీ రామ్ చందర్ రావ్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, పి.శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.