అక్షరటుడే, వెబ్డెస్క్: Sperm donation : సంతానం కోసం వీర్యం దాత(sperm donor)ల సాయం తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. కాగా, యూరప్లో జరిగిన ఓ ఘటన ఈ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మార్చింది. ఒక క్యాన్సర్ కారక జన్యువును కలిగి ఉన్న ఓ స్పెర్మ్ డోనర్ వల్ల, అతని వల్ల జన్మించిన 67 మంది పిల్లల్లో.. 10 మందికి క్యాన్సర్ సోకింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ డొనేషన్ నియంత్రణపై, జన్యు స్క్రీనింగ్(genetic screening) ప్రాధాన్యంపై చర్చను రేకెత్తించింది.
Sperm donation : TP53 జన్యువు(TP53 gene)లో మార్పు..
సదరు వీర్యం దాతలోని TP53 అనే జన్యువులో ఒక అరుదైన మ్యుటేషన్ (మార్పు) ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ మ్యుటేషన్ లి-ఫ్రామిని సిండ్రోమ్ (Li-Fraumeni Syndrome) అనే జన్యుపరమైన రుగ్మతకు కారణం అవుతుండటం గమనార్హం. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ డోనర్ ద్వారా 2008 నుంచి 2015 మధ్య వీర్యం సేకరించారు. ఆ సమయంలో అప్పటి స్క్రీనింగ్ పద్ధతులు ఈ జన్యు మార్పును గుర్తించలేదు.
Sperm donation : ఎనిమిది యూరోపియన్ దేశాలకు విస్తరించిన ప్రభావం
దాత స్పెర్మ్ను డెన్మార్క్(Denmark)లోని ఒక ప్రముఖ స్పెర్మ్ బ్యాంక్ (sperm bank) ద్వారా బెల్జియం(Belgium), జర్మనీ(Germany), గ్రీస్(Greece), స్పెయిన్(Spain), డెన్మార్క్(Denmark), ఫ్రాన్స్(France), స్వీడన్(Sweden), యునైటెడ్ కింగ్డమ్(United Kingdom) వంటి ఎనిమిది యూరోపియన్ దేశాల్లో(European countries)ని కుటుంబాలకు సరఫరా చేశారు.
ఈ దాత ద్వారా జన్మించిన 67 మంది పిల్లల్లో 10 మందికి ఇప్పటికే మెదడు కణితులు(brain tumors), హాడ్జికిన్ లింఫోమా(Hodgkin lymphoma), లుకేమియా(leukemia), నాన్-హాడ్జికిన్ లింఫోమా (non-Hodgkin lymphoma) వంటి తీవ్రమైన క్యాన్సర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మరో 13 మంది పిల్లలు ఈ జన్యు మార్పును వారసత్వంగా పొందారు. వీరికి భవిష్యత్తులో క్యాన్సర్(cancer) వచ్చే ప్రమాదం ఉంది.
Sperm donation : నియంత్రణలు, భవిష్యత్తు జాగ్రత్తలు
ఒకే దాత వీర్యాన్ని ఎంత మందికి పంపిణీ చేయాలనే దానిపై సరైన నియంత్రణ లేకపోవడం ఈ దుస్థితికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ ఒక డచ్ డోనర్ వీర్యం ద్వారా 500 – 600 మంది పిల్లలు పుట్టాకనే అతని డోనేషన్ను ఆపేశారు.
ఇక తాజా ఘటన జన్యు పరీక్షలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. స్పెర్మ్ డోనేషన్పై కఠినమైన నిబంధనలు రూపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఈ జన్యువును వారసత్వంగా పొందిన పిల్లలకు నిరంతర వైద్య పర్యవేక్షణ, తరచుగా స్క్రీనింగ్లు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన కృత్రిమ సంతానోత్పత్తి సంస్థలలోని భద్రతా ప్రమాణాలు, నియంత్రణను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని చెబుతోంది.