అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) అనంతరం భారత్, పాకిస్తాన్(Ind – pak) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో భారత్తో ఉంటూ శత్రు దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తిని కొట్టి చంపారు. కర్ణాటక(Karnataka)లోని మంగళూరు(Mangalore)లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా జరిగిన స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన ఒక వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటనను కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ధ్రువీకరించారు. పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఇప్పటికే కొందరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
Karnataka | పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు..
మంగళూరులో ఆదివారం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament)కు పది జట్లు, 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశాడు. ఈ క్రమంలో బాధితుడికి, మరో వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగింది. కాసేపటికే అది సామూహిక దాడికి దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంతమంది ఆగంతకులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, జనంలో ఒక వర్గం ఆ వ్యక్తిని కర్రలతో చితక్కొట్టారు. బాధితుడి మృతదేహం కనిపించిన తర్వాత సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. మొదట్లో పెద్దగా గాయాలు కనిపించలేదని, దీంతో అధికారులు సహజ మరణంగా అనుమానించారని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.. ఆ తర్వాత కేసును మంగళూరు(Mangalore) రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అయితే, సాయంత్రం తరువాత అసలు విషయం తెలిసిందని, ఆ వ్యక్తిపై కొందరు దాడి చేశారని చెప్పారు. వెన్లాక్ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన పోస్ట్మార్టంలో అంతర్గత రక్తస్రావం, వీపుపై దెబ్బలు తగిలిన కారణంగా షాక్కు గురై మరణించాడని తేలింది. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.