అక్షరటుడే, కామారెడ్డి: Bar Association | న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ (Chairman of Telangana Bar Council) నర్సింహారెడ్డిని జిల్లా న్యాయవాదులు కోరారు. గురువారం హైదరాబాద్లో అన్ని జిల్లాల అధ్యక్షులతో న్యాయవాదుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డికి కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ (Kamareddy District Bar Association) అధ్యక్షుడు నంద రమేష్ వినతిపత్రం అందజేశారు. బార్ కౌన్సిల్ తరపున న్యాయవాదులకు డెత్ బెనిఫిట్స్ రూ. 6 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచాలని కోరారు. హెల్త్ కార్డుల పరిమితి రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని, అదేవిధంగా నోటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
