More
    Homeక్రీడలుENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ...

    ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ENG-W vs IND-W : నాటింగ్‌హామ్‌లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్​(England) వర్సెస్​ టీమిండియా(Team India) T20I మ్యాచ్​లో అద్భుతం ఆవిష్కృతం అయింది. స్మృతి మంధాన(Smriti Mandhana) సెంచరీతో మెప్పించింది. తద్వారా మహిళల T20I లలో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా స్మృతి మంధాన నిలిచింది. తన సెంచరీతో ఎలైట్ జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ సరసన మంధాన చేరింది.

    ENG-W vs IND-W : కేవలం 51 బంతుల్లోనే..

    ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకున్న స్మృతి మంధాన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మైలురాయిని చేరుకుంది. మరియు ఫార్మాట్‌లో సెంచరీలు సాధించిన ఇద్దరు భారతీయ బ్యాట్స్‌మెన్‌గా హంమన్‌ప్రీత్ కౌర్‌తో చేరింది.

    ECB సెలెక్ట్ XIతో జరిగిన వార్మప్ మ్యాచ్​లో హర్మన్‌ప్రీత్(Harmanpreet Kaur) తలకు గాయం అయింది. దీంతో మంధాన స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకోవడంతో మహిళల టీమిండియా జట్టు బ్యాటింగ్​ చేపట్టింది. కాగా, మంధాన తొలి ఓవర్‌లోనే బౌండరీతో ఆటను ప్రారంభించింది. భాగస్వామి షఫాలీ వర్మతో కలిసి ఆడిన మంధాన తర్వాతి ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టింది.

    READ ALSO  Madhya Pradesh League | 33 బంతుల్లోనే సెంచ‌రీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్ అయిందిగా..!

    ENG-W vs IND-W : పవర్​ ప్లేలో..

    మంధాన అద్భుతంగా ఆడినప్పటికీ, పవర్‌ప్లే ఓవర్లలో టీమిండియా 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో మంధాన 31 పరుగులు చేసింది. కాగా, ఏడో ఓవర్‌లో మంధాన రెండు సిక్సర్లు కొట్టి, ఆ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు చేసి, ఆటను తన చేతుల్లోకి తీసుకుంది.

    ENG-W vs IND-W : అత్యధిక స్కోరు ఇదే..

    చివరికి మంధాన 62 బంతుల్లో 112 పరుగులు చేసి ఔట్​ అయింది. మొత్తంగా మహిళల టీమిండియా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మహిళల T20Iలలో మహిళల భారత్ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

    Latest articles

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు..యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు ఉంటాయి....

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    More like this

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు..యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు ఉంటాయి....

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...