అక్షరటుడే, వెబ్డెస్క్: ENG-W vs IND-W : నాటింగ్హామ్లో శనివారం(జూన్ 28) జరిగిన మహిళల ఇంగ్లండ్(England) వర్సెస్ టీమిండియా(Team India) T20I మ్యాచ్లో అద్భుతం ఆవిష్కృతం అయింది. స్మృతి మంధాన(Smriti Mandhana) సెంచరీతో మెప్పించింది. తద్వారా మహిళల T20I లలో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా స్మృతి మంధాన నిలిచింది. తన సెంచరీతో ఎలైట్ జాబితాలో హర్మన్ప్రీత్ కౌర్ సరసన మంధాన చేరింది.
ENG-W vs IND-W : కేవలం 51 బంతుల్లోనే..
ఈ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకున్న స్మృతి మంధాన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మైలురాయిని చేరుకుంది. మరియు ఫార్మాట్లో సెంచరీలు సాధించిన ఇద్దరు భారతీయ బ్యాట్స్మెన్గా హంమన్ప్రీత్ కౌర్తో చేరింది.
ECB సెలెక్ట్ XIతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్మన్ప్రీత్(Harmanpreet Kaur) తలకు గాయం అయింది. దీంతో మంధాన స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరించింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మహిళల టీమిండియా జట్టు బ్యాటింగ్ చేపట్టింది. కాగా, మంధాన తొలి ఓవర్లోనే బౌండరీతో ఆటను ప్రారంభించింది. భాగస్వామి షఫాలీ వర్మతో కలిసి ఆడిన మంధాన తర్వాతి ఓవర్లో రెండు బౌండరీలు కొట్టింది.
ENG-W vs IND-W : పవర్ ప్లేలో..
మంధాన అద్భుతంగా ఆడినప్పటికీ, పవర్ప్లే ఓవర్లలో టీమిండియా 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో మంధాన 31 పరుగులు చేసింది. కాగా, ఏడో ఓవర్లో మంధాన రెండు సిక్సర్లు కొట్టి, ఆ ఓవర్లో మొత్తం 19 పరుగులు చేసి, ఆటను తన చేతుల్లోకి తీసుకుంది.
ENG-W vs IND-W : అత్యధిక స్కోరు ఇదే..
చివరికి మంధాన 62 బంతుల్లో 112 పరుగులు చేసి ఔట్ అయింది. మొత్తంగా మహిళల టీమిండియా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మహిళల T20Iలలో మహిళల భారత్ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.