అక్షరటుడే, వెబ్డెస్క్: Liquor Scam | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు విచారణ నిమిత్తం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ అధికారులు(Sit Officers) ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy) హస్తం ఉందని సిట్ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఆయన గన్మన్గా పనిచేసిన ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మదన్రెడ్డి(Head Constable Madan Reddy)ని ఇటీవల విచారించారు.
Liquor Scam | ఒంటరిగా వెళ్లలేను
ఏపీ ప్రభుత్వానికి(AP government) ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్రెడ్డి సంచలన లేఖ రాశారు. సీఎం(CM), డిప్యూటీ సీఎం(Deputy CM), డీజీపీ(DGP)కి ఆయన రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్గా ఆయన పని చేశారు. లిక్కర్ కేసులో వారు చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. తన కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే విన్నాడని అధికారులు చెప్పారన్నారు. విచారణకు యూనిఫామ్లో వెళ్లనందుకు తనను తిట్టారని ఆయన లేఖలో పేర్కొన్నారు. చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పామన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు సిట్ అధికారులు తనపై దాడులు చేశారని ఆరోపించారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు(High Court)ను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. విచారణకు న్యాయవాదిని అనుమతించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
Liquor Scam | చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
బెంగళూరు ఎయిర్పోర్టులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా.. లుకౌట్ నోటీసుల(Lookout notices) కింద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వెనుతిరిగారు. ఆయనను విజయవాడలోని సిట్ కార్యాలయానికి(SIT office) పోలీసులు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.