అక్షరటుడే, వెబ్డెస్క్ :Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్(Former SIB chief Prabhakar) అమెరికా నుంచి రావడంతో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల స్టేట్మెంట్ సైతం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఫోన్ట్యాపింగ్(Phone Tapping)కు గురైన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు.
Phone Tapping Case | మూడు సార్లు విచారణ
బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు ప్రతిపక్ష నాయకులతో పాటు వ్యాపారులు, జడ్జీలు(Judges), సినీ ప్రముఖుల(movie celebrities) ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసు నమోదు చేసి విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు కేసు నమోదు అయిన మరుసటి రోజే అమెరికా(America) వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు(Supreme Court) అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడంతో ఆయన జూన్ 9న తిరిగి వచ్చారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ప్రభాకర్రావును అధికారులు 27 గంటల పాటు విచారించారు. అయినా ఆయన నోరు విప్పడం లేదని సమాచారం.
Phone Tapping Case | రివ్యూ కమిటీకి అన్ని తెలుసు
ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ మూడు సార్లు విచారించింది. ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్(FSL report) ఆధారంగా సిట్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాకర్రావు ఫోన్లను సైతం అధికారులు పరిశీలించారు. పైఅధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ చెప్పినట్లు సమాచారం. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసిన ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లు తీసుకొని కేసును మరింత బలంగా ముందుకు తీసుకు వెళ్లాలని సిట్ భావిస్తోంది.