అక్షరటుడే, వెబ్డెస్క్ : Assam | అస్సాం సీఎం (Assam CM) హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sharma) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలను ధ్వంసం చేయడానికి రాష్ట్రంలోని దుబ్రి జిల్లా (Dubri District)లో ఒక గ్యాంగ్ తిరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వాళ్లు కనిపిస్తే కాల్చిపారేయాలని shoot at sight ఆదేశించారు. ఈ మేరకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి శుక్రవారం దుబ్రి జిల్లాలో పర్యటించారు. అనంతరం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. జిల్లాలో ఒక గ్యాంగ్ ఆలయాలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో తిరుగుతోందన్నారు. జిల్లా పరిస్థితులను అంచనా వేయడానికి పర్యటించినట్లు ఆయన పేర్కొన్నారు. అవసరం అయితే మరోసారి జిల్లాకు వస్తానని తెలిపారు.
Assam | ప్రభుత్వం మీతో ఉంది
అస్సాం ప్రభుత్వం మీతో ఉందని ఆయన దుబ్రీ జిల్లా వాసులకు సీఎం భరోసా కల్పించారు. ప్రజలకు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామన్నారు. ఇటీవల ఒ పండుగ సందర్భంగా ఆలయంలోకి పశువుల మాంసం విసిరారు. అనంతరం జిల్లాలో మతపరమైన హింస చేలరేగింది. ఈ క్రమంలో అక్కడ పర్యటించిన సీఎం హింసకు పాల్పడే వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల అపవిత్రం చేసే వారిని వదిలి పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టమని ఆయన పేర్కొన్నారు.