More
    Homeఆంధ్రప్రదేశ్​Banakacherla | ఏపీ ప్రభుత్వానికి షాక్​.. బనకచర్లకు అనుమతి నిరాకరణ

    Banakacherla | ఏపీ ప్రభుత్వానికి షాక్​.. బనకచర్లకు అనుమతి నిరాకరణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacherla | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్​ (Banakacherla Project)కు అనుమతి నిరాకరించింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం గోదావరి (Godavari), కృష్ణా (Krishna) నదుల అనుసంధానం కోసం బనకచర్ల ప్రాజెక్ట్​ నిర్మించాలని నిర్ణయించింది. గోదావరి జలాలను ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్స్​ ద్వారా పొలవరం నుంచి శ్రీశైలం కుడి కాలువలోని బనకచర్ల హెడ్​ రెగ్యూలేటర్​ వద్దకు నీటిని తరలించాలని యోచించింది. అయితే ఈ ప్రాజెక్ట్​ నిర్మిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి ఢిల్లీ వెళ్లి బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి విన్నవించారు.

    READ ALSO  Nizamsagar project | ‘సాగర్’​కు పూడిక ముప్పు

    Banakacherla | నిపుణుల కమిటీ ఏమందంటే..

    ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై తాజాగా కేంద్ర నిపుణుల కమిటీ స్పందించింది. బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతి (Permission) ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని నిపుణుల కమిటీ పేర్కొంది. అనుమతుల కోసం గోదావరి వాటర్‌ డిస్ప్యూట్ ట్రైబ్యున్‌ అవార్డును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల కోసం CWC పరిశీలించాలని తెలిపింది.

    Banakacherla | హర్షం వ్యక్తం చేసిన కవిత

    బనకచర్ల ప్రాజెక్టకు అనుమతి నిరాకరణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎక్స్​ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా, పెన్నా బేసిన్ లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయమన్నారు. ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగృతి (Telangana Jagruthi), బీఆర్ఎస్ (BRS) సాధించిన విజయమని ఆమె పేర్కొన్నారు.

    READ ALSO  Thiruchanur | కారులో మద్యం సేవించిన యువ‌కులు.. ఊపిరాడ‌క మృతి

    ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాలని ఆమె అన్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు.

    Latest articles

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...

    Rajasthan | వన్యప్రాణుల అవయవాల అమ్మకం.. వల పన్ని పట్టుకున్న అధికారులు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajasthan | వన్యప్రాణుల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వాటి అవయవాలను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. తాజగా రాజస్థాన్‌లోని కోటాలో...

    More like this

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...