అక్షరటుడే, వెబ్డెస్క్ : Cab Services | మహారాష్ట్ర ప్రభుత్వం maharashtra ఓలా ola, ఉబర్ uber, ర్యాపిడో rapido వంటి సంస్థలకు షాక్ ఇచ్చింది. రైడ్ క్యాన్సల్ చేస్తే ఫైన్ వేస్తామని తెలిపింది. అలాగే రైడ్ బుక్ చేసుకున్న కస్టమర్ ఖాతాలో డబ్బు జమ అవుతాయని పేర్కొంది. ఓలా, ఉబర్ మరియు ర్యాపిడో సంస్థలను లక్ష్యంగా చేసుకుని అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ agrigater cabs policy 2025ను మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
Cab Services | సుప్రీం ఆదేశాల మేరకు..
సుప్రీంకోర్టు supreme court ఆదేశాల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో మహారాష్ట్ర సర్కార్ క్యాబ్ సర్వీసెస్పై కమిటీ వేసింది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ జవాబుదారీతనం, ఛార్జీల పారదర్శకతను పెంపొందించడానికి ఈ కమిటీ పలు సూచనలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా పాలసీ తీసుకొచ్చింది.
Cab Services | ప్రయాణికుల భద్రత కోసమే
ప్రయాణికుల భద్రత కోసమే కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త పాలసీ ప్రకారం ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థల వాహనాలకు రియల్-టైమ్ GPS ట్రాకింగ్, అత్యవసర బటన్లు తప్పనిసరి ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు పోలీసు ధృవీకరణ ఉండాలి. మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లను, సహ ప్రయాణీకులను ఎంచుకోవచ్చు. అలాగే ప్రస్తుతం క్యాబ్లలో రద్దీని బట్టి అధికంగా ఛార్జీ చేస్తున్నారు. దీనిని నివారించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఫీజు బేస్ ఛార్జీ కంటే 1.5 రెట్లకు మించొద్దని ఆదేశించింది.
Cab Services | రైడ్ క్యాన్సల్ చేస్తే ఫైన్లు
డ్రైవర్లు రైడ్ను తిరస్కరించిన, రద్దు చేసినా ఫైన్ వేస్తారు. సంబంధిత అమౌంట్ ప్రయాణీకుల అకౌంట్లో జమ చేస్తారు. డ్రైవర్ రైడ్ను క్యాన్సల్ చేస్తే రూ.వంద లేదా.. ప్రయాణ ఛార్జీలో పది శాతం( ఏది తక్కువైతే అది) జరిమానా వేస్తారు. ఈ జరిమానా మొత్తం ప్రయాణికుడి ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళా ప్రయాణికుడు రైడ్ క్యాన్సల్ చేస్తే రూ.50 లేదా.. ఫేర్ ఛార్జీలో 50 శాతం( ఏది తక్కువైతే అది) ఫైన్ వేస్తారు. సంబంధిత అమౌంట్ డ్రైవర్ అకౌంట్లో జమ అవుతంది.
Cab Services | డ్రైవర్ల సాధికారత కోసం..
కొత్త పాలసీలో డ్రైవర్ల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం పలు అంశాలు పొందుపరిచింది. ముఖ్యంగా బాగాలేని వాహనాలను తొలగించనున్నారు. అంతేగాకుండా డ్రైవర్ ప్రతి రైడ్ నుంచి కనీసం 80శాతం ఛార్జీని పొందాలి. ప్రస్తుతం కమీషన్ ఎక్కువ తీసుకుంటున్న కంపెనీలు డ్రైవర్లకు అరకొరగా ఛార్జీలు చెల్లిస్తున్నాయి. డ్రైవర్లకు శిక్షణ ఇప్పించడంతో ఆయా సంస్థలు బీమా కల్పించాలి.