అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకు (Collector Rajiv Gandhi Hanumanthu) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అకాల వర్షాలతో రైతులు సతమతమవుతున్నా.. ఇన్ఛార్జి మంత్రి (Incharge Minister jupalli) పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులు రేయింబవళ్లు కేంద్రాల్లోనే ఉంటూ ధాన్యం ఆరబోసేందుకు తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 12లక్షల మెట్రిక్ టన్నుల వరిసాగు చేసినట్లు వ్యవసాయ శాఖ (Department of Agriculture) అంచనా వేసిందని, ఇప్పటివరకు 8.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
మిగతా 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ కల్లాల్లోనే ఉందన్నారు. నెలరోజుల క్రితం తూకం వేసిన ధాన్యాన్ని ఇప్పటికీ లారీల్లో లోడ్ చేయలేదని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో రైతులు, బీజేపీ నాయకులు ఉన్నారు.