అక్షరటుడే, వెబ్డెస్క్ : Spying | ఆపరేషన్ సిందూర్ (operation sindoor)తో ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ pakistan ఆట కట్టించిన భారత్.. ఇప్పుడు ఇంటి దొంగల పని పడుతోంది. భారత్లో ఉంటూ పాక్కు సాయం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి టెర్రరిస్టుల క్యాంపులను ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత్పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా మన రక్షణ వ్యవస్థ indian defence system తిప్పికొట్టింది. అంతేగాకుండా పాక్లోని పలు ఎయిర్బేస్ pak airbase లపై భారత్ వైమానిక దళం indian air force దాడులు చేసింది. అనంతరం ఇరుదేశాలు కాల్పుల విరమరణ ceasefireకు అంగీకరించాయి.
Spying | గూఢచారులపై నిఘా
పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ భారత నిఘా వర్గాలు Intelligence agencies దాయాది దేశం గూఢచారులపై నిఘా పెట్టాయి. భారత్లో ఉంటూ పాకిస్తాన్కు రహస్య సమాచారం అందిస్తున్న వారి వివరాలు ఆయా రాష్ట్ర పోలీసులకు అందిస్తున్నాయి. దీంతో పోలీసులు పాక్కు సమాచారం చేరవేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా అస్సాం పోలీసులు పాకిస్తాన్కు సాయం చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు.
Spying | వాట్సాప్ ఓటీపీలు చెప్పి..
భారతీయ ఫోన్ నంబర్లతో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఓటీపీలు చెబుతున్న ఏడుగురిని అస్సాంలో అరెస్ట్ చేశారు. అస్సాం DGP హర్మీత్ సింగ్ harmot singh మాట్లాడుతూ.. పాకిస్తాన్లోని వ్యక్తులకు ఓటీపీ OTPలు పంపుతున్నట్లు తమకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందన్నారు. దీంతో సాంకేతిక ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు.
Spying | ఆపరేషన్ గోస్ట్ సిమ్
అస్సాం పోలీసులు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఆపరేషన్ గోస్ట్ సిమ్ Operation Ghost SIM ప్రారంభించారు. ఇందులో భాగంగా రాజస్థాన్, హైదరాబాద్కు బృందాలను పంపారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. భరత్పూర్, అల్వార్లో, గౌహతి విమానాశ్రయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సిమ్ కార్డులతో సైబర్ నేరాలు చేయడంతో పాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా ఉపయోగించినట్లు డీజీపీ తెలిపారు. ఈ నంబర్లలో కొన్నింటిని దేశ వ్యతిరేక శక్తులు విస్తృతంగా ఉపయోగించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వారిని విచారించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన వివరించారు.
Spying | పాక్కు వెళ్లి వచ్చి..
గూఢచర్యం ఆరోపణలపై హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను (youtuber jyoti malhotra) హిసార్ పోలీసులు (hiser police) అరెస్ట్ చేశారు. పాక్లో ఐఎస్ఐ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు. ఆమె గతంలో ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో పర్యటించింది. గూఢచర్యం ఆరోపణలపై ఆమెతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర సింగ్ 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లాడు.
అక్కడ పాకిస్తానీ నిఘా అధికారిని ఆయన కలిశాడు. హనీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ devendra singh ను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(Pakistan intelligence agency ISI) తమ గుప్పిట్లో పెట్టుకుంది. దేవేంద్రసింగ్ భారత సైనిక స్థావరాల వివరాలను పాక్కు అందించినట్లు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో కూడా పాక్కు సమాచారం చేరవేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.