అక్షరటుడే, వెబ్డెస్క్: CP Sai Chaitanya | నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad police commissionerate) పరిధిలో పలువురు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న 22 మంది సివిల్ ఏఎస్సైలను civil ASI ట్రాన్స్ఫర్ చేస్తూ మంగళవారం సీపీ సాయిచైతన్య (cp sai chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు.
Nizamabad CP | 26 మంది హెడ్ కానిస్టేబుళ్లు..
అంతేకాకుండా కమిషనరేట్ పరిధిలోని 26 మంది హెడ్ కానిస్టేబుళ్లను సీపీ సాయిచైతన్య ట్రాన్స్ఫర్ చేశారు. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలిగించారు. ట్రాన్స్ఫర్ అయిన హెడ్ కానిస్టేబుళ్లను సంబంధిత అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని సీపీ ఆదేశించారు. అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు వెంటనే కొత్త ప్రదేశాల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇప్పటికే 116 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

