అక్షరటుడే, ఇందల్వాయి: Robberies in Houses | ఇందల్వాయిలో వరుస చోరీ ఘటనలు ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. గత 15 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు దొంగలు హల్చల్ చేశారు.
శనివారం రాత్రి సైతం ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గంగాదాస్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి దాబామీద పడుకున్నాడు. ఆదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాను ధ్వంసం చేశారు. అందులో నగదు ఎత్తుకెళ్లారు. వరుస చోరీలకు అడ్డుకట్ట వేసేలా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.