అక్షరటుడే, వెబ్డెస్క్ : Gadwal | పెళ్లయిన నెలరోజులకే భార్య, ఆమె ప్రియుడి చేతిలో చనిపోయిన తేజేశ్వర్ హత్య కేసులో (Tejeshwar murder case) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గద్వాలకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు గత నెల 17న ఏపీలోని కర్నూల్కు (Kurnool) చెందిన ఐశ్వర్యతో వివాహం అయింది. అయితే అంతకు ముందే ఓ బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమె భర్తను (Husband) హత్య చేయించింది. అయితే ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.
Gadwal | మొదట భార్యను చంపాలనుకొని..
కర్నూల్లోని ఓ బ్యాంక్లో మేనేజర్గా (Bank manager) పని చేసే తిరుమల రావుకు గతంలోనే పెళ్లయింది. అయితే ఆయనకు పిల్లలు కాలేదు. ఈ క్రమంలో బ్యాంక్లో స్వీపర్గా పనిచేసే ఐశ్వర్య తల్లి సూజాతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఐశ్వర్యకు సైతం దగ్గరై ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం తన భార్యను చంపాలని పథకం పన్నాడు. అయితే ఈ విషయం బయటకు వస్తే తనకు చెడ్డ పేరు వస్తుందని వెనక్కి తగ్గాడు.
Gadwal | పారిపోయి సహజీవనం చేయాలని ప్లాన్
తిరుమలరావు (Tirumala Rao) తేజేశ్వర్ను చంపడానికి ఐశ్వర్య, సుజాతతో కలిసి పథకం వేశాడు. ఈ మేరకు హత్య కోసం ఓ గ్యాంగ్కు సుపారీ ఇచ్చాడు. దీంతో పరశురామ్, రాజు, నగేష్ అనే వ్యక్తులు తేజేశ్వర్ను దారుణంగా హత మార్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని తిరుమలరావుకు నిందితులు చూపించారు. దీంతో వారికి తిరుమలరావు రూ.రెండు లక్షలు చెల్లించాడు. అనంతరం మృతదేహాన్ని కర్నూలు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ (real estate) వెంచర్ లో పూడ్చాలని ప్లాన్ వేశారు. అయితే భయపడి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. హత్య అనంతరం ఐశ్వర్య తిరుమలరావు వేరే రాష్ట్రానికి పారిపోయి సహజీవనం చేయాలని ప్లాన్ వేశారు. అయితే హత్య కేసును ఛేదించిన పోలీసులు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాతను అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన పరశురామ్, రాజు, నగేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు తిరుమల రావు ఇంకా పరారీలోనే ఉన్నాడు.