అక్షరటుడే, వెబ్డెస్క్:ACB | అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీధర్ (Irrigation Department EE Sridhar) కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్సారెస్పీ డివిజన్ కార్యాలయం(SRSP Division Office)లో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్ ఇళ్లలో ఇటీవల దాడులు చేసిన ఏసీబీ అధికారులు దాడులు జరిపి (ACB Officers) భారీగా అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈగా వ్యహరించిన సమయంలో ఆయన కోట్లకు పడగలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు.
ACB | మరికొందరి పాత్ర
ఈఈ శ్రీధర్ వ్యవహారంలో మరికొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కాగా ఆయనను ఇరిగేషన్ చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ గతేడాది జూన్ 27న ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను పక్కనపెట్టిన శ్రీధర్.. బదిలీ అయిన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే పని చేయడం గమనార్హం. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ పనిచేసినట్లు అనుమానం.
ACB | కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్
ఈఈ శ్రీధర్ రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం చంచల్గూడ జైలు(Chanchalguda Jail)లో ఉన్నారు. ఆయనను కస్టడీకి అప్పగించాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఈఎన్సీ అనిల్, శ్రీధర్ సంబంధాలపై ఏసీబీ ఆరా తీయనున్నట్లు సమాచారం. వారం పాటు శ్రీధర్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.