అక్షరటుడే, కామారెడ్డి: SHO : కామారెడ్డి పట్టణ ఠాణా ఎస్హెచ్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎన్ నరహరిని ఆదివారం కామారెడ్డి(Kamareddy) సీనియర్ జర్నలిస్టులు(Senior journalists) కలిశారు. జర్నలిస్టులు వెంకటేశ్వర్లు, సిద్ధిరాములు, రంగరాజు, రాములు, వెంకటరమణ, రాజు తదితరులు సీఐని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణ ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు. పోలీసులకు కామారెడ్డి పట్టణ ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా(print and electronic media) జర్నలిస్టులు సహకరించాలని ఆయన కోరారు.