అక్షరటుడే, వెబ్డెస్క్ : Shadnagar | కిరాణ దుకాణంలో చాక్లెట్లు దొరుకుతాయి. కానీ ఈ దుకాణంలో మాత్రం గంజాయి చాక్లెట్లు(Cannabis Chocolates) లభిస్తాయి. హోటల్, కిరాణ దుకాణం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు(Excise Police) అరెస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా(Rangareddy District) షాద్నగర్ మండలం నందిగామ గ్రామంలో పింటూ సింగ్ అనే వ్యక్తి కిరాణ దుకాణం(Kirana Shop), హోటల్ నడిపిస్తున్నాడు. అందులో గంజాయి కూడా విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు శుక్రవారం రాత్రి దుకాణంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు గంజాయి, చాక్లెట్లు దొరికాయి. ఈ మేరకు శనివారం అధికారులు వివరాలు వెల్లడించారు.నందిగామ(Nandigama) పారిశ్రామిక ప్రాంతంలోని ఒక చిన్న హోటల్లో దాడి చేసి 2.5 కిలోల గంజాయి, 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పింటూ సింగ్ను అరెస్ట్ చేశామన్నారు.
Shadnagar | జోరుగా గంజాయి దందా
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ దందా(Drug Trafficking) జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేపడుతున్నారు. అంతేగాకుండా పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల కూలీలు ఉండే ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) డ్రగ్స్కు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టింది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు దాడులు చేస్తూ గంజాయి విక్రేతలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా దందా మాత్రం ఆగడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్(Hyderabad) నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది.