అక్షరటుడే, వెబ్డెస్క్ : సుదీర్ఘ వేసవి సెలవుల(Summer holidays) అనంతరం మళ్లీ బడి గంట మోగింది. దీంతో ఇన్ని రోజులు ఇంటి వద్ద ఎంజాయ్ చేసిన పిల్లలు బడిబాట పట్టారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. గురువారంతో సెలవులు పూర్తవడంతో బడులు పున:ప్రారంభం అయ్యాయి. పాఠశాలల ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తమ మిత్రులను కలుసుకోవడంతో విద్యార్థులు (Students) తొలిరోజు ఆనందంగా గడిపారు.
Schools Reopen | తల్లిదండ్రులు హ్యాపీ
వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎగిరి గంతేస్తారు. సమ్మర్ హాలీడేస్లో ఎంజాయ్ చేయొచ్చని భావిస్తారు. కానీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఇంటి వద్ద పిల్లలు చేసే అల్లరి మాములుగా ఉండదు. అదే పాఠశాలలు పున: ప్రారంభం కాగానే తొలి రోజు బడికి వెళ్లడానికి చాలా మంది విద్యార్థులు మొండికేస్తారు. ముఖ్యంగా ప్రైమరీ పాఠశాల స్థాయి విద్యార్థులు ఒకటి రెండు రోజులు బడికి వెళ్లాక కానీ సెట్ కారు. అయితే పాఠశాల పున: ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో చేసిన అల్లరి పనులతో చాలా మంది తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో బడులు ఓపెన్ కావడంతో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారని వారు భావిస్తున్నారు.
Schools Reopen | మార్కెట్లలో సందడి
బడులు పున: ప్రారంభం కావడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. విద్యార్థులు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, ఇతర స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లలో సందడి నెలకొంది. ఫీజులు, సామగ్రి కొనుగోలు కోసం డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని మధ్య తరగతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలే ప్రైవేట్ బడుల్లో సామగ్రిని అధిక ధరలకు తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. కాగా పాఠశాలల పున: ప్రారంభోత్సవాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు.