అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన అనంతరం తొలిసారి బుధవారం ఫామ్హౌస్(Farmhouse)కు వెళ్లారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్లనున్న సందర్భంగా ఆమె ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి ఆమె తన తండ్రిని కలిశారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి కొంతకాలంగా దూరంగా ఉంటున్న కవిత.. ఇటీవల జాగృతిపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. పార్టీలో కొందరు దెయ్యాలు ఉన్నారంటూ ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి తనను దూరం చేస్తున్నారని కేటీఆర్(KTR), సంతోష్రావు(Santosh Rao)ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో బుధవారం కేసీఆర్ ఫామ్హౌస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ వెంట సంతోష్రావు లిఫ్ట్లో కిందకు రాగా.. కవిత మాత్రం మెట్లపై నుంచి నడుచుకుంటూ వచ్చారు. అనంతరం కూడా ఆమె అక్కడి నాయకులతో అంటి ముట్టనట్లుగానే వ్యవహరించారు. బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) కేసీఆర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా కవిత(MLC Kavitha) దూరంగా నిలబడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.