అక్షరటుడే, వెబ్డెస్క్ :Sanjay Raut | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సిందూర్(Opertaion Sindoor) చేపట్టింది. ఇందులో భాగంగా తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తాజాగా ఆపరేషన్ సిందూర్పై శివసేన (యూబీటీ) ఎంపి సంజయ్ రౌత్(MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విఫలమైందని ఆయన ఆరోపించారు. కానీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు(Tourists), ఒక స్థానిక పౌరుడు మృతి చెందాడు. అనంతరం మే 7 భారత్ పాక్లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అయితే దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. అసలు ఆపరేషన్ సిందూర్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు పహల్గామ్లో 26 మంది మహిళలను వితంతువులుగా మార్చడంతో ఈ ఆపరేషన్ చేపట్టారని, కానీ దానికి హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు.పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడని రౌత్ ప్రశ్నించారు. వారు గుజరాత్లో దాక్కున్నారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి హోం మంత్రి అమిత్ షా నే బాధ్యులని ఆయన అన్నారు.