ePaper
More
    HomeతెలంగాణGP Workers | పంచాయతీ కార్మికులకు శుభవార్త.. జీతాలు విడుదల

    GP Workers | పంచాయతీ కార్మికులకు శుభవార్త.. జీతాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో జీపీ కార్మికులు(GP Workers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ఇటీవల ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్పస్​ వర్కర్లకు(Multi Purpose Workers) వేతనాలు విడుదల చేసింది.

    రాష్ట్రంలో పని చేసే పంచాయతీ కార్మికులకు గతంలో పంచాయతీ ఖాతాల నుంచి జీతాలు చెల్లించేవారు. దీంతో జీపీలకు వచ్చే నిధులలో నుంచి కార్మికులకు జీతాలు ఇచ్చేవారు. లేదంటే సర్పంచులు సొంతంగా నెలనెలా జీతాలు ఇచ్చి తర్వాత నిధులు విడుదలైనప్పుడు తీసుకునే వారు. అయితే 16 నెలలుగా పల్లెల్లో పాలక వర్గాలు లేవు. అంతేగాకుండా ప్రభుత్వం నేరుగా జీపీ కార్మికుల ఖాతాల్లో వేతనాలు వేస్తోంది. అయితే ప్రతినెలా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

    READ ALSO  CM Delhi Tour | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్​రెడ్డి.. ఎందుకో తెలుసా..!

    GP Workers | రూ.150 కోట్లు విడుదల

    పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్​ కార్మికుల వేతనాల కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు (Finance Department Orders) జారీ చేసింది. ఏప్రిల్​, మే, జూన్​ నెలలకు సంబంధించిన వేతనాల కోసం ఈ నిధులను కేటాయించింది. ఈ మేరకు నిధులు కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి నెలా తమకు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే.. మిగతా రోజుల్లో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    READ ALSO  Banakacharla Project | ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ

    Latest articles

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...

    CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధ వహించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని...

    More like this

    Rajasthan | రీల్స్ పిచ్చితో చిన్నారి ప్రాణం పణంగా పెట్టిన వైనం.. రాజస్థాన్‌లో తండ్రి నిర్లక్ష్యంపై నెటిజన్స్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం...

    Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది(Krishna River)కి భారీగా వరద వస్తోంది....

    Guru Purnima | గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Guru Purnima | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురుపౌర్ణమి(Guru Purnima) ఒకటి. ఆషాఢ...