అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | ఖరీఫ్ కోసం రైతులు పొలంపనుల్లో తలమునకలై ఉన్నారు. కానీ, ఇటీవల ట్రాన్స్ఫార్మర్ల (Transformers) చోరీలు పెరుగుతుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులు, ట్రాన్స్కో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాన్స్ఫార్మర్లకు చుట్టూ ఇనుప గ్రిల్ తో వెల్డింగ్ చేయిస్తున్నారు.
ఎస్సై శివకుమార్ (SI Shivakumar), విద్యుత్ శాఖ సిబ్బంది (Electricity Department) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట శివారులో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తెరవడానికి వీలు లేకుండా ఇనుప రాడ్లతో వెల్డింగ్ చేయించారు. తద్వారా ఆయిల్, కాయిల్స్ చోరీని నివారించవచ్చని వారు పేర్కొన్నారు. మిగితా రైతులు సైతం తమ పొంటపొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను రక్షించేలా ఇలా చేయించుకుంటే చోరీలను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శీను, లైన్మన్ షేరు తదితరులున్నారు.