ePaper
More
    HomeజాతీయంMadhya Pradesh | సహజీవన భాగస్వామిని చంపి.. మృతదేహం పక్కనే రెండ్రోజులు గ‌డిపిన యువకుడు

    Madhya Pradesh | సహజీవన భాగస్వామిని చంపి.. మృతదేహం పక్కనే రెండ్రోజులు గ‌డిపిన యువకుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Madhya Pradesh | చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డ‌డం, ఆవేశంలో చంపుకోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో చాలా చూస్తున్నాం. తాజాగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న ఓ జంట మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వల్ల ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన క‌ల‌క‌లం రేపుతుంది. మధ‍్యప్రదేశ్(Madhya Pradesh) రాజధాని భోపాల్‌(Bhopal)లో చోటుచేసుకున్న ఈ హత్యా ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ రాజ్‌పుత్ (32) అనే యువకుడు గత నాలుగేళ్లుగా రితికా సేన్ (29) అనే యువతితో లివ్‌ఇన్‌ రిలేషన్‌(Live In Relationship)లో ఉండేవాడు. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న సచిన్‌, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రితికాపై తరచూ అనుమానాలు వ్యక్తం చేసేవాడట.

    READ ALSO  Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర 2025కి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక యాత్ర సిమ్ కార్డు.. ఎలా తీసుకోవాలి?

    Madhya Pradesh | ఆవేశంతో..

    ఈ అనుమానాలు ఘర్షణకు దారితీశాయి. జూన్‌ 27న వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో సచిన్ తను స‌హ‌జీవ‌నం చేస్తున్న భాగస్వామిని గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తాను చేసిన చర్యకు భయపడి, రితిక మృతదేహాన్ని దుప్పటితో కప్పి, రెండు రోజుల పాటు అదే గదిలో మద్యం తాగుతూ మృతదేహం పక్కనే నిద్రించాడు. అయితే.. జూన్‌ 29వ తేదీన మద్యం మత్తులో సచిన్ తన మిత్రుడైన అనూజ్‌కు ఈ విషయం చెప్పడంతో మర్డర్ విష‌యం బయటపడింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    రితికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించగా, శరీరంపై గాయాల గుర్తులు, గొంతుపై నులిమిన గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికల(Forensic Reports) ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సచిన్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రితిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సహజీవన సంబంధాల పట్ల అవగాహన లోపం, ఆరోపణలు, అనుమానాలు చివరకు మరణం దాకా ఎలా తీసుకెళ్తాయో ఈ ఘటన తెలియ‌జేస్తుంది

    READ ALSO  US ISKCON temple | అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు.. తీవ్రంగా ప‌రిగణించిన భార‌త్

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....