More
    HomeతెలంగాణRythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Rythu Nestham | రైతులకు వ్యవసాయ సూచనలు అందించడానికి ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని పలు రైతు వేదికల్లో రైతు నేస్తం అమలు అవుతోంది. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అధికారులు అందించే సలహాలు, సూచనలను రైతులు(Farmers) వినే అవకాశం ఉంటుంది. తాజాగా ప్రభుత్వం మరిన్ని రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ అమలు చేయాలని నిర్ణయించింది.

    Rythu Nestham | 1,034 రైతు వేదికల్లో..

    రాష్ట్రంలో ఇప్పటికే 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్(Video conference) సౌకర్యం కల్పించారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో మంది రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం మరో 1,034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన పరికరాలు ఇప్పటికే వచ్చాయి. వాటిల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్నారు.

    READ ALSO  Yellareddy | రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో చోరీ

    Rythu Nestham | రైతులతో మాట్లాడనున్న సీఎం

    రైతు నేస్తం(Rythu Nestham) కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడనున్నారు. ఇప్పటికే వానాకాలం సాగు సీజన్​ ప్రారంభం కావడంతో పనుల గురించి ఆయన ఆరా తీయనున్నారు. రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) కోరారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏర్పాట్లపై ఆదేశాలు ఇచ్చామన్నారు.

    Rythu Nestham | ఊరికి దూరంగా రైతు వేదికలు

    బీఆర్​ఎస్​ హయాంలో క్లస్టర్​ గ్రామాల వారీగా రైతు వేదికలు నిర్మించారు. అయితే చాలా గ్రామాల్లో వీటిని గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. వేదికల్లో ఏర్పాటు చేసిన సామగ్రిని దొంగలు చోరీ చేశారు. కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా రైతు వేదిక(Rythu Vedika)లను వినియోగిస్తున్నారు. అంతేగాకుండా అందులోని వస్తువులు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్లు కిటికీలు, తలుపులను కూడా ఆకతాయిలు ధ్వంసం చేశారు. తాజాగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​ పరికరాలు అందులో పెడితే ఉంచుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    READ ALSO  Deputy CM Bhatti | తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కి గుడ్ న్యూస్ చెప్పిన భ‌ట్టి.. ఆనందంలో ప్ర‌ముఖులు

    Latest articles

    Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా...

    prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: prajavani | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు...

    Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు...

    Nizamabad Collector | కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Collector | నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని రాష్ట్ర సహకార...

    More like this

    Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా...

    prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: prajavani | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు...

    Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు...