More
    HomeతెలంగాణRythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    Rythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా(Ryrthu Bharosa) నిధులు జమ చేస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులను సోమవారం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోజమ చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం రేవంత్​రెడ్డి నిధులు విడుదల చేయగా రాత్రి వరకు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు నిధులు జమ అయ్యాయి.

    Rythu Bharosa | ఎప్పుడు లేనంత వేగంగా..

    రాష్ట్రంలో ఎప్పుడైనా రైతు భరోసా మొదట ఎకరంలోపు రైతులకు(Farmers) విడుదల చేసేవారు. అనంతరం రెండు, తర్వాత మూడు ఎకరాల్లోపు.. ఇలా విడతల వారీగా నిధులు విడుదల చేసేవారు. కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress government) వచ్చాక అయితే నిధుల విడుదలతో తీవ్ర జాప్యం నెలకొంది. గత యాసంగి సీజన్​కు సంబంధించి నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. అయితే వానాకాలం సీజన్​కు మాత్రం వేగంగా రైతు భరోసా జమ చేస్తుండడం గమనార్హం.

    READ ALSO  Districts In-charge Ministers | జిల్లాల ఇంఛార్జి మంత్రులు వీరే..

    Rythu Bharosa | 41.25 లక్షల రైతులకు..

    రాష్ట్ర ప్రభుత్వం(State Government) తొలిరోజు రెండు ఎకరాల్లో భూమి ఉన్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ఇందులో ఎకరాల్లోపు భూమి ఉన్న వారు 24,22,678 మంది, ఎకరా నుంచి రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న వారు 17,02,611 మంది రైతులు ఉన్నారు. మొత్తం 41.25 లక్షల రైతుల ఖాతాల్లో 39.16 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,349 కోట్లు జమ చేసింది. మంగళవారం మూడు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. తొమ్మిది రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.

    Rythu Bharosa | రైతుల హర్షం

    ప్రస్తుతం రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సకాలంలో పెట్టుబడి సాయం జమ చేయడంతో రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు తొమ్మిది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తే సాగు పెట్టుబడి ఎంతో ఉపయోగ పడతాయని రైతులు పేర్కొంటున్నారు.

    READ ALSO  Gaddar Film Awards | నేడే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథి ఎవరంటే..

    Latest articles

    Minister Seethakka | మంత్రి సీతక్కను కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | టీపీసీసీ జనరల్​ సెక్రెటరీగా (TPCC General Secretary) నియామకమైన గడ్డం చంద్రశేఖర్...

    SP Rajesh Chandra | కొత్త లోగో మా పనితీరును ప్రతిబింబిస్తుంది

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra |జిల్లా పోలీసు శాఖ కొత్త లోగో తమ పనీతిరుని ప్రతిబింబిస్తుందని ఎస్పీ...

    Karnataka Deputy CM | సైకిల్ పైనుండి కింద ప‌డ్డ ఉప ముఖ్య‌మంత్రి.. మీడియాలో చూపించొద్దంటూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Karnataka Deputy CM | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Bangalore chinnaswamy stadium) దగ్గర జరిగిన తొక్కిసలాట...

    Nizamsagar | అంగన్​వాడీలో సామూహిక అక్షరాభ్యాసం

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మహమ్మద్​నగర్ (Mahammad nagar) మండలంలోని కొమలంచ (komalancha) గ్రామంలో అంగన్​వాడీ కేంద్రంలో మంగళవారం...

    More like this

    Minister Seethakka | మంత్రి సీతక్కను కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | టీపీసీసీ జనరల్​ సెక్రెటరీగా (TPCC General Secretary) నియామకమైన గడ్డం చంద్రశేఖర్...

    SP Rajesh Chandra | కొత్త లోగో మా పనితీరును ప్రతిబింబిస్తుంది

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra |జిల్లా పోలీసు శాఖ కొత్త లోగో తమ పనీతిరుని ప్రతిబింబిస్తుందని ఎస్పీ...

    Karnataka Deputy CM | సైకిల్ పైనుండి కింద ప‌డ్డ ఉప ముఖ్య‌మంత్రి.. మీడియాలో చూపించొద్దంటూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Karnataka Deputy CM | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Bangalore chinnaswamy stadium) దగ్గర జరిగిన తొక్కిసలాట...