Site icon aksharatoday.in

Mla Prashanth Reddy | రైతు భరోసా కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమే..

Mla Prashanth Reddy

Mla Prashanth Reddy | రైతు భరోసా కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమే..

అక్షరటుడే, ఇందూరు: Mla Prashanth Reddy | రైతు భరోసా అనేది కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నేపథ్యంలో రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు (Rythu bandhu), రుణమాఫీ (Runa mafhi) పూర్తిస్థాయిలో అందించని కాంగ్రెస్​కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth reddy) రైతులపై ప్రేమ లేదని, ఓట్ల కోసం మాత్రమే నటిస్తున్నారన్నారు.

Mla Prashanth Reddy | బీజేపీ, కాంగ్రెస్​ రెండూ ఒక్కటే..

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, దానిపై దృష్టి సారించాలని ప్రశాంత్​రెడ్డి సూచించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని అందుకే బీజేపీ ఎంపీలు ఉన్నచోట మంత్రి పదవులు ఇవ్వడం లేదని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) పోలీస్ ఇన్వెస్టిగేట్ అధికారిగా మాట్లాడుతున్నారన్నారు. కేవలం కేటీఆర్​ను (KTR) జైలుకు పంపడమే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టే కార్యక్రమాలు ఎక్కువ రోజులు సాగవన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్ రావు, నాయకులు ప్రభాకర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version