Site icon aksharatoday.in

Nizamabad OBC Morcha | సమగ్రాభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం

Nizamabad OBC Morcha

Nizamabad OBC Morcha | సమగ్రాభివృద్ధి మోదీ ప్రభుత్వ లక్ష్యం

అక్షరటుడే, ఇందూరు: Nizamabad OBC Morcha | దేశంలోని అన్ని రంగాల ప్రజల సమగ్రాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ అన్నారు. మంగళవారం రూరల్ పరిధిలోని మల్లారం (mallaram village) గ్రామంలో రచ్చబండ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కళ్యాణ్ యోజన, ఘర్ ఘర్ జల్ యోజన, ఆవాస్ యోజన తదితర పథకాల ద్వారా కోట్లాదిమంది ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రవి, సొసైటీ డైరెక్టర్ గోపి, గంగాధర్, దశరథ్, మోహన్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version