అక్షరటుడే, వెబ్డెస్క్: Dirham : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ (United Arab Emirates dirham)తో పోల్చితే భారత్ రూపాయి (Indian rupee) చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయి రూ.23.5కి చేరుకుంది. ఇది గల్ఫ్లోని భారతీయ ప్రవాస సమాజంలో ఉత్సాహం నింపింది. రూపాయి విలువ పడిపోవడంతో స్వదేశానికి డబ్బులు పంపేవారు పెద్ద మొత్తంలో నగదు అందుకుంటున్నారు. ఇంటికి డబ్బు పంపేందుకు అక్కడి గల్ఫ్ వలస కార్మికులు (Gulf migrant workers) ఉత్సాహపడుతున్నారు.
తాజా డేటా ప్రకారం.. జూన్ 21, 2025న 1 AED మార్పిడి రేటు ₹23.58కి చేరుకుంది. జూన్ 22, 2025న ₹23.59 వద్ద ఆగింది. ఇటీవలి కాలంలో రూపాయికి అత్యల్ప పాయింట్లలో ఇది ఒకటిగా చెప్పొచ్చు. 2025 సగటు మారకపు విలువ ₹23.44గా ఉంది. కానీ, ఇటీవలి ఈ తగ్గుదల రూపాయిని దాని వార్షిక శ్రేణి యొక్క బలహీన ముగింపునకు చేర్చింది.
ఈ క్షీణత అంటే UAE , ఇతర గల్ఫ్ దేశాల(Gulf countries)లోని భారతీయ కార్మికుల్లో ఉత్సాహం నింపింది. ఎందుకంటే విదేశీ ఆదాయంపై ఆధారపడిన కుటుంబాలకు ఇది అరుదైనదిగా పేర్కొనవచ్చు. ఈ క్రమంలో వారు తమ సంపాదనను ఇంటికి పంపించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ప్రస్తుతం తగ్గిన రూపాయి విలువ.. ప్రవాసులకు ఒక ప్రత్యేకమైన ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ, రూపాయి భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక ధోరణులు, భారతదేశ ఆర్థిక విధానాలు, భారత రిజర్వు బ్యాంకు (Reserve Bank of India) జోక్యాలపై ఆధారపడి ఉంటుందని కరెన్సీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి, భారతీయ కుటుంబాలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. రేట్లు స్థిరీకరించబడటానికి లేదా తిరగబడటానికి ముందే చాలా మంది పెద్ద మొత్తాలను ఇంటికి పంపాలని చూస్తున్నారు.