అక్షరటుడే, వెబ్డెస్క్:RTC Strike | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె(Strike)కు వెళ్తామని అంటున్నారని.. వారి డిమాండ్ల కోసం రాష్ట్రంలో ఏ పథకాన్ని ఆపాలో వారే నిర్ణయించాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమ్మె పేరుతో ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవవద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) సమ్మె చేస్తే తెలంగాణ దివాళా రాష్ట్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొందరు ఫామ్హౌస్(Farmhouse)లో నిద్రపోతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ సంస్థ కూడా భవిష్యత్తులో మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. మీకు(ఆర్టీసీ సిబ్బందికి) జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు.