అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Strike | ఆర్టీసీ ఉద్యోగులు RTC employees సమ్మెకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ ఉద్యోగులకు rtc employees బహిరంగ లేఖ రాసింది. సమ్మెకు వెళ్లొద్దని కోరింది.
ప్రస్తుత ఆర్టీసీ పరిస్థితులను లేఖలో వివరించింది. కాగా తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ యూనియన్ RTC unions సంఘాలు పేర్కొన్న విషయం తెలిసిందే. సమ్మెపై కార్మిక సంఘాల నాయకులు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో Minister Ponnam Prabhakar చర్చించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ RTC company ఉద్యోగులకు employees లేఖ రాసింది.
RTC Strike | అమ్మ లాంటి ఆర్టీసీని కాపాడుకోవాలి
అమ్మలాంటి ఆర్టీసీని RTC కాపాడుకోవాలని, సమ్మెలు చేయొద్దని లేఖలో కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని యాజమాన్యం management తెలిపింది. ప్రభుత్వ government, ఆర్టీసీ సంస్థ RTC organization పరిస్థితులను వివరించడంతో పాటు.. ఉద్యోగుల employees సంక్షేమం విషయంలో యాజమాన్యం management ఏమాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. ఎవరైనా సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
RTC Strike | ఉద్యోగులతోనే అభివృద్ధి పథంలోకి..
ఉద్యోగులు క్షేత్రస్థాయిలో కష్టపడటంతోనే సంస్థ company అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆర్టీసీ లేఖలో RTC letter పేర్కొంది. అలాంటి ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంది. ఆర్థికంగా financial ఇబ్బందులు ఉన్నా.. ఇప్పటికే పలు పనులు చేసినట్లు గుర్తు చేసింది. సమ్మె చేస్తే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఎస్మా చట్టం ESMA Act ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని లేఖలో గుర్తు చేసింది.