అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ (Madhapur)లో భారీ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయని నమ్మించిన ఓ సంస్థ ప్రజల నుంచి రూ.500 కోట్లు వసూలు చేసింది. మాదాపూర్లోని ఏవీ ఇన్ఫ్రాకాన్ (AV Infracon) ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బైబ్యాక్ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది.
తమ కంపెనీలో పెట్టుబడి పెడితే డబుల్ ఇస్తామని సంస్థ యజమాని విజయ్ గొగుల ప్రజలను నమ్మించారు. డబ్బులు ఇవ్వకపోతే తగిన భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. సుమారు 500 మంది నుంచి రూ.500 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతకు డబ్బులు రిటర్న్ ఇవ్వకపోవడంతో బాధితులు ఆయనను ప్రశ్నించారు. దీంతో మరో ప్రాజెక్ట్ ఉందంటూ నమ్మించాడు.
బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే బ్లాంక్ చెక్కులు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సైబరాబాద్ (Cyberabad) కమిషనరేట్లో, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.