అక్షరటుడే, కామారెడ్డి: National Lok Adalat | రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.1.40కోట్ల పరిహారం అందించారు. ఈ మేరకు శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో (National Lok Adalat) జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (District Chief Judge Varaprasad) కేసును పరిష్కరించారు.
వివరాల్లోకి వెళ్తే.. తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బైక్పై వెళ్తూ తాడ్వాయి (Tadwai) సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు ఇన్సూరెన్స్ కంపెనీకి పరిహారం కోసం క్లెయిమ్ చేయగా, వివాదం నడిచింది. దీంతో వారు ఇన్సూరెన్స్ కంపెనీ సహా ప్రతివాదులపై కోర్టులో క్లెయిమ్ దాఖలు చేశారు. శనివారం లోక్ అదాలత్లో ఈ కేసు రాజీ కుదిరింది. మృతుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మంజూరైన రూ.1.40 కోట్ల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.