అక్షరటుడే, వెబ్డెస్క్ :MLC Kavitha | రేవంత్రెడ్డి (CM Revanth Reddy) లాంటి అసమర్థ ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన అనంతరం బీఆర్ఎస్తో దూరంగా ఉంటున్న కవిత.. తెలంగాణ జాగృతి బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శనివారం పలువురు విద్యార్థి నాయకులు (Student leaders) జాగృతిలో చేరారు. వారికి కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
MLC Kavitha | సామాజిక తెలంగాణ సాధించాలి
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొనాలన్నారు.
MLC Kavitha | రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలి
బీసీ రిజర్వేషన్ల బిల్లులు (BC Reservation Bills) కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదని ఆమె అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha | తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సీఎం
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని కవిత వ్యాఖ్యానించారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని సీఎం అని ఎద్దేవా చేశారు. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruti) విద్యార్థి విభాగం విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్మెంటు బకాయిలు ఉన్నాయని.. వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.