అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరస్తులు cyber criminals రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ work from home, స్టాక్ మార్కెట్ stock marketలో లాభాలు, క్రిప్టో కరెన్సీ crypto currency పేరిట ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వీరి మాయలో పడి మోసపోతున్న వారిలో అధిక శాతం విద్యావంతులే ఉండటం గమనార్హం. తాజాగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ retired IAs అధికారి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.37 కోట్లు మోసపోయాడు.
Cyber Fraud | స్టాక్ మార్కెట్లో లాభాలని చెప్పి..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో పని చేసిన ఓ ఐఏఎస్ అధికారి (72)కు సైబర్ నేరస్తుడు వల వేశాడు. సోమాజీగూడ somajigudaలో నివాసం ఉంటున్న ఆయనకు స్టాక్ మార్కెట్లో లాభాల పేరిట ఎర వేశాడు. తాము రూపొందించిన ఏఐ పరిజ్ఞానంతో AI Technology మ్యూచువల్ ఫండ్స్ Mutual Funds, ఐపీవోల్లో IPO పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయం లోనే 120-160 శాతం వరకు లాభాలు పొందొచ్చని నమ్మించాడు.
అంతేగాకుండా నిత్యం ఆయనకు ఫోన్ చేస్తూ స్టాక్ మార్కెట్కు సంబంధించిన సలహాలు ఇచ్చాడు. దీంతో ఆ మాజీ అధికారి వారి మాటలు నమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నాడు. దీని కోసం నిందితుడు చెప్పిన ఖాతాల్లోకి విడతల వారిగా రూ.3.37 కోట్లను వేశాడు. దీనికి రూ.22.35 కోట్ల లాభమొచ్చిందని మాజీ ఐఏఎస్కు వర్చువల్ ఖాతాలో చూపించాడు. అయితే ఆ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.