అక్షరటుడే, హైదరాబాద్: HYDRAA | భాగ్యనగరం డెవలప్మెంట్ అంతా హైటెక్ సిటీ కేంద్రంగా కొనసాగుతోంది. ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా.. దారులు మాత్రం అటువైపే అన్నచందంగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే హైటెక్ సిటీకి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలతోపాటు కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్ అభివృద్ధి చెందాయి.
జేఎన్టీయూ JNTU జనావాసాలు నిండిపోవడంతో నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట, సింహపురి కాలనీ వరకు ఆవాస ప్రాంతాలు విస్తరించాయి. ఇప్పుడు ఇవికూడా దాదాపు పూర్తిగా నిండిపోయాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా… మేడ్చల్ Medchal జిల్లా దుండిగల్ Dundigal మండలం ఓ సమస్య గత కొన్నేళ్లుగా స్థానికులను వెంటాడింది. ఔటర్ రింగ్ రోడ్డు Outer Ring Road ఎగ్జిట్ నంబరు 4 నుంచి ప్రగతినగర్ వెళ్లాలంటే.. ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరు మల్లంపేట Mallampet, బాచుపల్లి Bachupally క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి వచ్చేది.
కాగా, ఇలా నిత్యం రద్దీతో వాహనదారులు అల్లాడేవారు. అయితే స్థానికంగా రెండు కాలనీల మధ్య ఓ అడ్డుగోడ ఉంది. దీనివల్ల మూడు కిలోమీటర్ల దారి కాస్త, 8 కిలోమీటర్లకు చేరింది. ఈ అడ్డుగోడ కూల్చివేస్తే.. సుమారు 25 వేల మంది ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే ఒకేసారి 5 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది.
HYDRAA | హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో..
ఈ అడ్డుగోడ విషయంలో మల్లంపేట్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ గోడను తొలగిస్తే 40 - 60 అడుగుల వెడల్పుగల రహదారి మళ్లీ వినియోగంలోకి వస్తుందని వివరించారు. ఈ మేరకు హైడ్రా అధికారులు ఈ ఫిర్యాదును పరిశీలించారు. ఇందులో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్యూడీఏ) Hyderabad Urban Development Authority (HIUDA) ఆమోదం తెలిపిన లేఅవుట్ ప్రకారం ఈ ప్రాంతం గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు.
కబ్జా చేసి, ఆక్రమించినట్లు తేలింది. రహదారులను అడ్డుకునేలా గోడలు నిర్మించకూడదని హెచ్ఎండీఏ HMDA నిబంధన 7లో స్పష్టంగా ఉంది.
ఈ మేరకు ఈ గోడను హైడ్రా కూల్చివేసింది. స్థానికుల ఆశ నెరవేరేలా రహదారిని పునరుద్ధరించింది. ఫలితంగా సుమారు 25 వేల మందికి ప్రయోజనం చేకూరింది.