అక్షరటుడే, వెబ్డెస్క్: RCB vs KKR | ఐపీఎల్ 2025 (IPL 2025) లెక్కలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. వర్షం పడడంతో కొన్ని మ్యాచ్లు రద్దు కావడం వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన భారత్ -పాక్ యుద్ధం (india-pakistan war) వలన ఐపీఎల్కి బ్రేక్ పడింది. తిరిగి నిన్నటి నుండి ప్రారంభించారు. శనివారం (మే 17) చిన్నస్వామి స్టేడియంలో (chinnaswamy stadium) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (royal challengers bangalore) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ (defending champions kolkata knight riders) జట్టు IPL 2025 నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్సీబీ 17 పాయింట్లతో టాప్లో నిలిచింది. అయినా కూడా ప్లేఆఫ్స్కి (play-offs) పోలేని పరిస్థితి. ఈ రోజు జరిగే మ్యాచ్లో ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ (rajasthan royals) గెలిచి, పంజాబ్ కింగ్స్ (punjab kings) ఓడితే బెన్ఫిట్ మొత్తం ఆర్సీబీకే ఉంటుంది.
RCB vs KKR | ఏం జరుగుతుందో..
ఒకవేళ ఈ రోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ (Punjab) ఓడితే 15 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంటుంది. అప్పుడు ఆర్సీబీ 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ (play-offs birth) కన్ఫార్మ్ చేసుకోనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. పంజాబ్ కింగ్స్పై మంచి రికార్డే సాధించింది. ఈ సీజన్లో రాజస్థాన్ గెలిచిన మూడు మ్యాచ్లలో ఒకటి పంజాబ్పై ఘన విజయం సాధించింది. పంజాబ్ హోం గ్రౌండ్లోనే ఆ జట్టును రాజస్థాన్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఆ మ్యాచ్లో రాజస్థాన్ 205 పరుగులు చేయగా.. పంజాబ్ కింగ్స్ కేవలం 155 పరుగులకే పరిమితమైంది. దాంతో 50 పరుగుల ఘన విజయాన్ని అందుకుంది. శ్రేయాస్ అయ్యర్ (shreyas iyer) కెప్టెన్సీలో పంజాబ్ అద్భుతాలు చేస్తుంది.
అయితే రాజస్థాన్ (rajastan) జట్టులో జోఫ్రా ఆర్చర్ లేకపోవడం పంజాబ్కు కలిసొచ్చే అంశం. అదే విధంగా కొంతకాలంగా డగౌట్కే పరిమితమైన సంజూ శాంసన్ (sanju samson) రాకతో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్ కానుంది. ఇకపై మ్యాచ్లకు వర్షం అడ్డుపడకపోతే, గుజరాత్, ముంబై జట్లు చివరికి 18 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ముగిస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు (RCB play-offs race) నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ చివరికి నెట్ రన్ రేట్ (net run rate) ఆధారంగా నిర్ణయించబడుతుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ జట్లు (punjan kings and delhi capitals teams) గెలిస్తేనే ఇది జరుగుతుంది. ఆ తర్వాత, ఢిల్లీ తదుపరి మ్యాచ్లో పంజాబ్ను ఓడించి, ముంబై జట్టు తన రెండు మ్యాచ్ల్లోనూ గెలిస్తే, అప్పుడు అంతా RCB నెట్ రన్ రేట్పై ఆధారపడి ఉంటుంది. కానీ, RCB ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే, ఆదివారం జరిగే డబుల్ హెడర్లో పంజాబ్ vs రాజస్థాన్ (punjab vs rajasthan) లేదా ఢిల్లీ vs గుజరాత్ (delhi vs gujarath) తమ మ్యాచ్ను ఓడిపోవాల్సి ఉంటుంది. బెంగళూరు జట్టు మిగిలిన రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిచినా, ప్లేఆఫ్లో దాని స్థానం ఖాయం అవుతుంది.