అక్షరటుడే, వెబ్డెస్క్: ipl 2025 | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో Chinnaswamy Stadium జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా ఆర్సీబీ RCB, సీఎస్కే CSK మధ్య 52వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు Bangalore జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని కూడా సీఎస్కే CSK సులువుగా చేదిస్తుంది అని అందరు అనుకున్నారు. కాని పూర్తి ఓవర్లు ఆడిన తర్వాత 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. 214 పరుగుల భారీ లక్ష్యచేధనలో షేక్ రషీద్ Sheikh Rashid (14), సామ్ కరన్ Sam Curran (5) విఫలమైనా.. ఆయుషే మాత్రే Ayush Mathre, జడేజా jadeja విధ్వంసకర బ్యాటింగ్తో batting చెలరేగారు. మూడో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం partnership నెలకొల్పారు.
ఆయుషే మాత్రే Ayush Mathre సెంచరీకి చేరువవుతున్న సమయంలో రవీంద్ర జడేజా Ravindra Jadeja హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇచ్చిన నాలుగు సునాయస క్యాచ్లను ఆర్సీబీ ఆటగాళ్లు RCB players వదిలేయడంతో సీఎస్కే విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ లుంగి ఎంగిడి 17వ ఓవర్లో వరుసగా ఆయుష్ మాత్రే Ayush Mathre, డెవాల్డ్ బ్రేవిస్ Dewald Brevis (0)లను పెవిలియన్ చేర్చి మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్లో last over సీఎస్కే విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. యశ్ దయాల్ Yash Dayal తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ధోనీని ఎల్బీగా ఔట్ dismissed Dhoni చేశాడు. నాలుగో బంతిని బీమర్గా వేయడంతో శివమ్ దూబే Shivam Dubey భారీ సిక్సర్ బాదాడు. ఇది నోబాల్ noball కావడంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి.
కట్టడిగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్ Yash Dayal మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 8 బంతులాడిన ధోనీ Ms Dhoni ఒక సిక్స్తో 12 పరుగులే చేశారు. అతను కాస్త దూకుడిగా ఆడి ఉంటే సీఎస్కే విజయం సాధించేది. అయితే నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ RCB విజయం సాధించడంతో ప్లే ఆఫ్ pla off చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ సారైన ఆర్సీబీ కప్ సాధించాలని ఫ్యాన్స్ Fans ఎంతగానో కోరుకుంటున్నారు.