అక్షరటుడే, వెబ్డెస్క్: RCB trending on social media : ఐపీఎల్ 2025(IPL 2025) ఫైనల్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు(oyal Challengers Bangalore) విజయంతో సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది. నెటిజన్లు(Netizens) ఆర్సీబీని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సాలా కప్ నమ్డే అంటూ ఆర్సీబీ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఎక్స్(ట్విటర్) X (Twitter)లో అయితే పోస్టులన్నీ ఆర్సీబీవే ఉండటం గమనార్హం. అటు ఫేస్బుక్లోనూ బెంగళూరు జట్టు(Bengaluru team) పోస్టులతో నిండిపోయాయి.
సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెంగళూరు జట్టు ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక, బెంగళూరు యువత తమ జట్టు ఆటగాళ్లపై ఎక్స్ లో నిలువెత్తు అభిమానం చాటుతున్నారు.
పద్దెనిమిదేళ్ల బెంగళూరు జట్టు కల ఓ వైపు ఎట్టకేలకు నెరవేరగా.. పంజాబ్ జట్టు(Punjab team) 18 ఏళ్ల కల మాత్రం తృటిలో చేజారిపోయింది. ఆ జట్టును గెలిపించేందుకు శశాంక్ యాదవ్ చివరి వరకు పోరాడాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.