అక్షరటుడే, అమరావతి: Raymond Group : ప్రముఖ వస్త్ర సంస్థ రేమండ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. రూ.1200 కోట్లతో గార్మెంటింగ్ (garmenting), ఏరోస్పేస్ (aerospace), రక్షణ defense రంగాల sectors లో కీలక ప్రాజెక్టులను చేపట్టనుంది. రాప్తాడులో వస్త్ర యూనిట్ ఏర్పాటు, శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai district) గుడిపల్లి ఇండస్ట్రియల్ పార్కు (Gudipalli Industrial Park)లో రక్షణ, ఆటోమోటివ్ రంగాల్లో కాంపోనెంట్స్ ప్లాంట్ ఏర్పాటుకు రేమండ్స్ సంస్థ ముందుకొచ్చింది.
ప్రతిష్ఠాత్మక సంస్థ రాకతో ఏపీ ఆర్థికి వృద్ధికి ఊతం కలగడంతో పాటు స్థానికంగా భారీగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న ఆ సంస్థ.. గతంలోనే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu Naidu)తో రేమండ్ సంస్థ ఛైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా(Raymond Chairman, MD Gautam Hari Singhania) సమావేశమయ్యారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా పేరొందిన రేమండ్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడంతో ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, వస్త్ర పరిశ్రమ సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో ఏపీలో రూ.1200 కోట్లతో వస్త్ర యూనిట్ తో పాటు రక్షణ, ఆటోమోటివ్ సంస్థలు స్థాపించనుంది.