అక్షరటుడే, వెబ్డెస్క్ : Ration Cards | రేషన్ కార్డులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు minister tummala సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ హయాంలో రూ.3 కిలో ఉన్న బియ్యాన్ని రూ.2 కు ఇచ్చారని.. ఇప్పుడు రూ.60 కిలో ఉన్నప్పుడు ఉచితంగా ఇవ్వడం ఎందుకని..? ఆయన ప్రశ్నించారు. అసలైన అర్హులకు మాత్రమే ఉచితాలు అందాలన్నారు. కానీ, రాష్ట్రంలో అనేక మంది అనర్హులు కూడా ఉచిత పథకాలు పొందుతున్నారని వ్యాఖ్యానించారు.
Ration Cards | కుటుంబాల కంటే కార్డులే ఎక్కువ
కార్లు ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. రేషన్ బియ్యం తినకుండా అమ్ముకునే వారికి ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే, కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.
కాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తున్న సమయంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఇటీవల ఓ జిల్లాలో రేషన్ బియ్యం అమ్ముకున్న 11 మంది కార్డులను అధికారులు తొలగించారు. దీంతో రానున్న రోజుల్లో అనర్హుల రేషన్కార్డులు తొలగిస్తారేమోనని చర్చ జరుగుతోంది.