అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prestige Hospital | నగరంలోని ప్రెస్టేజ్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స నిర్వహించినట్లు క్రిటికల్ కేర్ వైద్యురాలు ప్రతిమారాజ్ (Critical Care Doctors Pratimaraj) తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎడపల్లి(Yedapally) మండలం కుర్నాపల్లి(Kurnapally) గ్రామానికి చెందిన నవీన్ శరీరంలోని ప్రధాన అవయవాలతో పాటు నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో అతడి కుటుంబీకులు తమ ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అయితే అతడు అరుదైన గులియన్ బారే సిండ్రోమ్తో (Guillain-Barre syndrome) బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే ఐసీయూలో ఉంచి తక్కువ ఖర్చుతో చికిత్స చేశామని వివరించారు. సమావేశంలో నెఫ్రాలజీ వైద్యుడు మోసిన్, వినోద్, ఆస్పత్రి డైరెక్టర్ కైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.