అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్ operation sindoor కు మద్దతుగా ఈ నెల 9న భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి telangana jagruthi సంస్థ ప్రకటించింది.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత MLC Kavitha హాజరవుతారని పేర్కొంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్కు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని సంస్థ కోరింది. భారత సైన్యానికి ప్రజలంతా అండగా నిలవాలని.. సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేసింది.