అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Update | రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం(Weather) మారిపోయింది. మొన్నటి వరకు వానలు(Rains) ముంచెత్తాయి. వానాకాలాన్ని తలపించేలా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే శనివారం నుంచి రాష్ట్రంలో ఎండలు పెరిగాయి. మే 20 నుంచి 30 వరకు వర్షాలతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అయితే మళ్లీ ఎండలు మండుతుండటంతో క్రమంగా టెంపరేచర్ పెరుగుతోంది.
రాష్ట్రంలో ఆదివారం కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలో దాటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ (Hyderabad)లో వాతావరణం పొడిగా ఉంటుందన్నారు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం రాత్రి సైతం పలు జిల్లాల్లో వర్షం పడింది.