ePaper
More
    HomeజాతీయంRailway Passengers | రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇక బోగీల్లో సీసీ కెమెరాలు

    Railway Passengers | రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇక బోగీల్లో సీసీ కెమెరాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | దేశవ్యాప్తంగా రవాణా రంగంలో రైల్వేలది కీలక పాత్ర. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు రైళ్లలోనే రాకపోకలు సాగిస్తారు. భారతీయ రైల్వే(Indian Railways) నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలు చేరవేస్తుంది.

    ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని రైల్వేశాఖ(Railway Department) పలు కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే వేగవంతమైన ప్రయాణం కోసం వందే భారత్​ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే రైళ్లలో పరిశుభ్రత, ప్రయాణికుల భద్రతపై ఎప్పటి నుంచే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా అన్ని బోగీలలో సీసీ కెమెరాలు(CCTV Cameras) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    Railway Passengers | ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా..

    ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అన్ని కోచ్​లు డోర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రైళ్లలో దొంగల బెడద అధికంగా ఉంది. ఇటీవల రైలు దోపిడీ(Train Robbery) ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దారి మధ్యలో రైళ్లను ఆపి దొంగలు ప్రయాణికులను దోపిడీ చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే రైల్వేశాఖ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Arunachalam | అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణ వ్యక్తి హత్య

    Railway Passengers | అక్కడ సక్సెస్​ కావడంతో

    రైల్వే కోచ్‌(Railway Coach)లకు సీసీ కెమెరాల ఏర్పాటును నార్తరన్​ రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 74 వేల కోచ్‌లు, 15 వేల లోకో కోచ్‌లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) ఆమోదం తెలిపినట్లు సమాచారం.

    Railway Passengers | ఆధునిక సీసీ కెమెరాలు..

    ప్రతి కోచ్‌ ఎంట్రీల వద్ద సీసీ కెమెరాలు అమర్చనున్నారు. లోకో కోచ్‌లకు ద్వారాలతో పాటు ముందు, వెనుకతో కలిపి ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. చీకట్లో సైతం వీడియో మంచిగా వచ్చేలా ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

    READ ALSO  Capsule Hotels | రైల్వే స్టేష‌న్‌లో అత్యాధునిక వ‌స‌తులు.. విశాఖ‌లో ప్రారంభ‌మైన‌ క్యాప్సుల్ హోటల్స్‌

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...