అక్షరటుడే, బోధన్: Railway gateman | రైల్వే గేట్మన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట్లో (Navipet) సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ (Nizamabad Railway Station) మాస్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రానికి చెందిన విజేంద్రకుమార్ నవీపేట్ గేట్మన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తాను పనిచేస్తున్న క్యాబిన్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కు గల కారణాలు తెలియరాలేదని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
